హాస్యాంజలికి స్వాగతం...

ఒకరికి ఒకరు

9, డిసెంబర్ 2009, బుధవారం


వృద్ధ దంపతులు హోటలుకు వెళ్లారు. ముందు ముసలాయన భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు. భోజనం రాగానే తినడం మొదలుపెట్టాడు. ముసలామె భర్తనే చూస్తూ కూర్చుంది.
వీళ్ళనే గమనిస్తున్న పక్కటేబుల్ యువజంట రాజు,రేఖాకి అది ఆశ్చర్యంగా అనిపించింది.
రాజు: ఏం బామ్మగారూ..... మీరు భోంచెయ్యరా? అని అడిగాడు.
ముసలామె: ఆయనది కాగానే చేస్తానుబాబు వినయంగా చెప్పిందామె.
రేఖా: పతిదేవుడు ఆరగించనిదే బామ్మగారు పచ్చిమంచినిళ్ళు కూడా ముట్టరా వ్యంగ్యంగా అంది .
ముసలామె: మేము దేనైనా సగం సగం పంచుకుంటాం జవాబిచ్చిందామే.
రేఖా: కొంపదీసి..... భోజనం కూడానా?
ముసలామె: కాదు కట్టుడుపళ్ళను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.